ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా యోగాలక్ష్మి ఆర్ట్ క్రియే షన్స్ బ్యానర్పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్.శ్రీనివాస రావు నిర్మాణంలో రాజేష్ నాదెండ్ల తెరకెక్కిన చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’. ఇటీవల థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ, ‘మా సినిమాపై మీరు చూపించిన ప్రేమ, ఆదరణ మా హృద యాలను హత్తుకుంది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది. పూర్తిగా పాజిటివ్ టాక్ ఉంది. నిన్నటి కంటే ఈ రోజు కలెక్షన్స్ పెరిగినందుకు ఆనందంగా ఉంది. మౌత్టాక్ కూడా ప్రేక్షకులను థియేటర్కు వెళ్లేలా చేస్తుంది. మా చిత్ర యూనిట్ ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్నాం. మీ ఆశీర్వాదాలకు, సపోర్ట్కు ధన్యవాదాలు’ అని అన్నారు. ‘ప్రేక్షకులు మా సినిమాను ఇంతగా ఆదరించడంలో మాకు ఎంతో ప్రోత్సాహం లభించింది. సినిమాని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు’ అని హీరోయిన్ నైనా సర్వర్ చెప్పారు. దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ, ‘మా సినిమా ద్వారా చెప్పాలనుకున్న సందేశాన్ని ప్రేక్షకులు అందరికీ చేరవేయడం చాలా ఆనందంగా ఉంది. మా ప్రయత్నాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అని అన్నారు. ‘సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులు, మీడియా, మా టీమ్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని నిర్మాతలు అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్. శ్రీనివాసరావు తెలిపారు.
సూపర్హిట్ చేశారు
- Advertisement -
RELATED ARTICLES