అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో లండన్ బయల్దేరిన ఎయిరిండియా ఏఐ-171 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో విమాన సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. ఈ విషాదకర ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు.
అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న విమానంలో జరిగిన భయంకరమైన విషాదం గురించి విని చాలా బాధపడ్డాను. ఇది ఎంత హదయ విదారకమో చెప్పడానికి మాటలు సరిపోవు. – చిరంజీవి
గుజరాత్లో జరిగిన విమాన ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది. ప్రయాణికులతో పాటు సిబ్బంది… అలాగే విమానం కూలిన ప్రదేశంలో ఉన్న మరికొంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హదయాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో మన భారతీయులతో పాటు విదేశీయులూ ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరం. ఈ జాతీయ విపత్తు సమయంలో దేశం మొత్తం ఒక్కటై బాధిత కుటుంబాలకు మానసిక బలం అందించాలి. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలి. – బాలకష్ణ
242 మందితో లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది. – పవన్కళ్యాణ్
మహేష్బాబు, ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రవితేజ, సాయిదుర్గతేజ్, నాని, విజరు ఆంటోని, నభా నటేష్, మంచు విష్ణుతోపాటు పలువురు సినీ ప్రముఖులు జరిగిన ఘటనపై సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు.
బాసటగా ఉండాల్సిన సమయమిది
- Advertisement -
- Advertisement -