నవతెలంగాణ – జుక్కల్
తెలంగాణ ఉప పీఠం దోసపల్లి (బంగారు పల్లి), జుక్కల్ నుండి సెప్టెంబర్ 27న ప్రారంభమైన పాదయాత్ర న్యానిజ్ ధామ్ వైపు భక్తి పూర్వకంగా కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు పాల్గొన్నారు. సోమవారం రోజున న్యానిజ్ ధామ్ వైపు బయలుదేరిన పాయ దీండీలో మార్గమధ్యలో భక్తులతో కలిసి నడుచుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. హన్మంత్ షిండే గారు మాట్లాడుతూ.. “జగద్గురు నరేంద్ర స్వామి జీ అడుగుజాడల్లో నడుస్తూ భక్తి మార్గంలో పాదయాత్ర విజయవంతం కావడం ఆనందకరం. అందరూ ఎల్లప్పుడూ భక్తి మార్గంలో నడవాలి,” అని ఆకాంక్షించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ను పాయ దీండీ నిర్వహకులు మరియు జగద్గురు నరేంద్ర చార్య మహారాజ్ స్వామీజీ భక్తులు సన్మానించారు.
జగద్గురు నరేంద్ర చార్యజీ వసుంధర పాయ దీండి – న్యానిజ్ ధామ్ వైపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES