నవతెలంగాణ-హైదరాబాద్ : జేమ్స్ కెమెరూన్ సినిమాలకు వరల్డ్ సినిమాలో ఓ స్పెషల్ పేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు హాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్స్ రాబడతాయి. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో భారతీయ బాక్సాఫీసును షేక్ చేశాడు కామెరూన్. ఆయన సినిమాలు స్ట్రయిట్ ఇండియన్ సినిమాలతో పోటీగా కలెక్షన్స్ రాబడతాయి. ఇది జేమ్స్ కెమెరూన్ క్రేజ్ అంటే. అవతార్ తర్వాత అవతార్ 2 తీసుకోవడానికి 13 ఏళ్లు తీసుకున్నప్పటికీ అవతార్ ద వే ఆఫ్ వాటర్ భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు అవతార్ ఫ్రాంచైజీ నుండి టూ ఫిల్మ్స్ రాగా, ఇప్పుడు థర్డ్ మూవీ రాబోతుంది.
గత రెండు సినిమాల మాదిరి అవతార్ 3ని కూడా ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది. తాజాగా అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. జేమ్స్ కెమెరాన్ ఈ సారి మునుపెన్నడి చూడని పండోరాను చూపించేందుకు రెడీ అయ్యాడు. కథ ఏంటనేది చెప్పకుండా విజువల్ ఫీస్ట్ అందిస్తూ టెక్నికల్లి, విజువల్లి బ్రిలియంట్ వర్క్ చేసాడు కామెరూన్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మరో రెండు సీక్వెల్స్ కూడా తెరకెక్కబోతున్నాయి. 2029లో, 2031లో ఆ టూ ఫిల్మ్స్ రాబోతున్నాయి. పంచ భూతాల కాన్సెప్టుతోనే జేమ్స్ కెమెరాన్ తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేల, నీరు, ఇప్పుడు నిప్పును తీసుకు వస్తున్నాడు. ఇంత హైప్ క్రియేట్ చేస్తున్న అవతార్ 3 క్రిస్మస్ కానుకగా రాబోతున్న వేళ ఓపెనింగ్ రోజే రికార్డ్స్ బద్దలు కొట్టేలా ఉన్నాడు. మరి ఈ సారి జేమ్స్ ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.