నవతెలంగాణ-హైదరాబాద్: అమర్నాథ్ యాత్ర పై జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జూలై 1 నుండి ఆగస్టు 10 వరకు అమర్నాథ్ యాత్రా మార్గాలను ‘నో-ఫ్లై జోన్’గా ప్రకటించింది. ఈ నిర్ణయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సలహా మేరకు తీసుకున్నట్లు స్థానిక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో అమర్నాథ్ యాత్ర మార్గాల్లో డ్రోన్లు, యూఏవీలు, బెలూన్లు వంటి ఏవైనా వైమానిక పరికరాల వినియోగం నిషేధించబడింది. ఈ ఆంక్షలు పహల్గామ్, బాల్టాల్ మార్గాలకు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే, వైద్య తరలింపు, విపత్తు నిర్వహణ, భద్రతా దళాల నిఘాకు సంబంధించిన సందర్భాల్లో ఈ ఆంక్షలు వర్తించవని, దీనికి సంబంధించిన వివరణాత్మక SOP త్వరలో జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES