నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత జాతీయ భద్రతపై కేంద్రం అప్రమత్తమైన విషయం తెలిసిందే. దీంతో ఇంటి దొంగలను భద్రతా దళాలు వేటాడుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్న ముగ్గురు అధికారులపై జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వేటు వేశారు. ముగ్గురిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు గూఢచారులుగా పని చేస్తున్నట్లుగా గుర్తించి వేటు వేశారు. ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటివరకు 75 మంది ప్రభుత్వ అధికారులకు ఉగ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.
ఇప్పటికే పాకిస్థాన్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లాంటి ఎంతో మందిని నిఘా అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ కోవలో అనేక మంది ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.