- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తాను శ్రీలంక కోచ్ పదవి నుంచి దిగిపోతున్నట్లు సనత్ జయసూర్య ప్రకటించారు. T20 వరల్డ్ కప్లో శ్రీలంక సూపర్-8లోనే ఇంటిదారి పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కొత్త కోచ్ అన్వేషణ మొదలుపెట్టింది. 2024లో జయసూర్య కోచ్ బాధ్యతలు చేపట్టారు. జూన్ 2026 వరకు కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ మధ్యలోనే రాజీనామా చేశారు. ఇతడి హయాంలో శ్రీలంక 76 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడగా 36 మ్యాచుల్లో గెలిచింది.
- Advertisement -



