నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భారత తొలి ప్రధాని, పిల్లల పక్షపాతి , అభివృద్థి ప్రదాత పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్థంతి ని భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో జరుగుతున్న పిల్లల వేసవి శిక్షణా శిబిరం లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పిల్లలతో కలిసి జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జవహర్ బాల్ మంచ్(జే బి ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య భారత్ లో తొలి ప్రధాని నెహ్రూ రూపొందించిన “పంచవర్ష ప్రణాళికలు” విద్య యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించి ప్రాథమిక స్థాయి వరకు “ఉచిత నిర్బంధ విద్యను” అమలు చేసి, అందించారని ఆయన అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ కాలంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటి) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ ) లను ఏర్పాటు చేసిన ఘనత జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుందని ఆయన అన్నారు. విద్యా రంగంతో పాటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను జవహర్ లాల్ నెహ్రూ అభివృద్ధి పథంలో నడిపించారని ఆయన అన్నారు. పిల్లల పక్షపాతి అయిన జవహర్ లాల్ నెహ్రూ ఆశయాలు నెరవేర్చాలని, “నేటి బాలలే-రేపటి పౌరులు” గా బాలలందరూ ఉత్తమ పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జవహర్ బాల్ మంచ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా కో- ఆర్డినేటర్ ఎర్ర శివరాజ్, సమ్మర్ క్యాంపు కో- ఆర్డినేటర్ పిట్టల అంజయ్య, పిట్టల వెంకటేష్, ఇంద్రయ్య, శివ కుమార్, సాయి కుమార్, సాయినాథ్, సోహెల్, విద్యార్థులు పాల్గొన్నారు.
భారత తొలి ప్రధాని చాచా నెహ్రూకు జేబీఎం ఆధ్వర్యంలో ఘన నివాళులు…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES