నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పుర్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసింది. సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించిన ఐఐటీ కాన్పుర్ షెడ్యూల్ కంటే ముందుగానే ఫలితాలను వెల్లడించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి పరీక్షా ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://results25.jeeadv.ac.in/
లింక్ ఓపెన్ చేశాక, మీ తొమ్మిది అంకెల రోల్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రార్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి స్కోర్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్లో అభ్యర్థి సాధించిన మార్కులతో కామన్ ర్యాంక్ లిస్ట్, కేటగిరీ ర్యాంక్ లిస్ట్ను ఇవ్వనున్నారు.
ఫైనల్ కీ పేపర్ 1 కోసం … https://jeeadv.ac.in/documents/p1_solutions_final.pdf
ఫైనల్ కీ పేపర్ 2 కోసం … https://jeeadv.ac.in/documents/p2_solutions_final.pdf
దేశంలోని ప్రతిష్ఠాత్మకంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించారు. సుమారు 1.87 లక్షల మంది పరీక్ష రాసినట్లుగా తెలుస్తోంది. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ఉంటారని సమాచారం. సీట్ల భర్తీకి ఈసారి ఆరు విడతల జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)-2025 కౌన్సెలింగ్ జరగనుంది. ఐఐటీ కాన్పుర్ ఇటీవల కౌన్సెలింగ్ షెడ్యూల్ను జోసా-2025 వెబ్సైట్లో పెట్టింది. జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 9, 11 తేదీల్లో మాక్ సీట్ అలాట్మెంట్ 1, 2 ; జూన్ 12న ఫైనల్ ఛాయిస్ లాకింగ్ జరగనున్నాయి. అనంతరం జూన్ 14 న ఒకటో విడత, జూన్ 21 న రెండో విడత, జూన్ 28 న మూడో విడత జోసా కౌన్సిలింగ్ జరగనున్నాయి. ఇక నాలుగు, ఐదు ఆరో విడద కౌన్సిలింగ్లు వరుసగా జులై 4, జులై 10, జులై 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక ఈ ఏడాది స్వల్పంగా సీట్ల పెరిగే అవకాశం ఉంది. గత విద్యాసంవత్సరం (2024-25) 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి మద్రాస్ ఐఐటీ సహా పలు ఐఐటీల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాయి.