- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పాటు అతడి అనుచరులు నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లిలో మర్యాదపూర్వకంగా కలువనున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్లో చేరుతానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవన్రెడ్డిని కేసీఆర్ మధ్యాహ్నా భోజనానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్లో చేరిక తేదీ, రాష్ట్రంలోని ఇతర రాజకీయ అంశాలపై చర్చింనున్నారు.
- Advertisement -



