- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాంచీలోని అశోక్ నగర్లో ఝార్ఖండ్ హైకోర్టు లాయర్ స్నేహ అఖౌరి, తన కుమారుడు, కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఆమె కుమారుడు మిహిర్ మృతిచెందగా, లాయర్ స్నేహ అఖౌరి, ఆమె కుమార్తె విషం తీసుకోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం ఇంట్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
- Advertisement -



