నవతెలంగాణ – భీంగల్
భీంగల్ పట్టణంలోని మొగిలి చెరువు నుండి ఎక్కువైన నీటిని చెరువు అలుగు, తూముల ద్వారా రాతం చేరువు కు దిగువ భాగంలో నీరు వెళ్లేందుకు వీలుగా కాలువ నిర్మాణం చేయనున్నారు. బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ కోరిక మేరకు గతంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పట్టణం లోని మొగిలి చెరువు ను సందర్శించిన సంగతి తెలిసిందే. మొగిలి చెరువు ద్వారా దిగువ ప్రాంతం లో ఉన్న రాతం చెరువు లోకి నీరు వెళ్లేందుకు గతంలో ఉన్న సాగునీటి కాలువ ను లేకుండా చేసి ఇంటి స్థలాలు ఏర్పాటు చేసిన సంగతి ని ఎమ్మెల్యే గుర్తించారు. కాలువ లేక పోవడం కారణంగా ప్రతి వర్షాకాలం అయ్యప్ప నగర్, విగ్నేశ్వర కాలనీ, కొత్త బస్టాండ్ కాలనీలు నీట మునుగుతున్నాయి. దాంతో ఇరిగేషన్, రెవిన్యూ అధికారులకు కాలువ నిర్మాణం కొరకు సర్వే నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తిరిగి వర్షాకాలం ప్రారంభం కావడం తో శుక్రవారం ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మొగిలి చెరువు ప్రాంతాన్ని మరో మారు పరీశీలన జరిపారు. చెరువు నిండుగా నిండి అలుగు ద్వారా నీరు దిగువ ప్రాంతం లోని రాతం చెరువులోకి వెళ్లేందుకు వీలుగా కాలువ నిర్మాణం చేపట్టెందుకు పరిశీలన జరిపారు. చెరువు ఆయకట్టు రైతులు, స్థానిక లీడర్ల నుండి అభిప్రాయాలు తీసుకున్నారు. కాలువ నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వారం రోజుల్లో కాలువ పునరుద్ధరణ కార్యక్రమం అధికారులు చేపడతామన్నారు. వీరి వెంట తహసీల్దార్ షబ్బీర్,ఇరిగేషన్ డిఈ నాగేశ్వర్,ఎస్సై మహేష్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్,ఇరిగేషన్,రెవిన్యూ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొదిరే స్వామి, టౌన్ ప్రెసిడెంట్ జేజే నర్సయ్య,మల్లెల లక్ష్మణ్,కుంట రమేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
చెరువు కాలువ నిర్మాణం కొరకు ఉమ్మడి సర్వే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES