- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. 4.01 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందు కోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 58 మంది అభ్యర్థులు ఉన్నా.. ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పక్షాన నవీన్ యాదవ్, బీజేపీ తరఫున లంకల దీపక్రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
- Advertisement -



