- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధానంగా పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ అభివృద్ధి అజెండాతో, బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత, సెంటిమెంట్తో, బీజేపీ సైలెంట్ ఓటుతో బరిలో నిలిచాయి. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. కాగా ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు పాల్గొనకపోవడం గమనార్హం.
- Advertisement -



