Friday, May 23, 2025
Homeజాతీయంబీజేపీ ఎమ్మెల్యేకి జ్యుడీషియల్‌ కస్టడీ

బీజేపీ ఎమ్మెల్యేకి జ్యుడీషియల్‌ కస్టడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: 2019 దాడి కేసులో అలీనగర్ బీజేపీ ఎమ్మెల్యే మిశ్రీలాల్‌ యాదవ్‌, అతని సహచరుడికి బీహార్‌లోని దర్బాంగా జిల్లాలోని కోర్టు శుక్రవారం జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఎమ్మెల్యే, అతని సహచరులను అదుపులోకి తీసుకోవాలని గురువారం దర్భాంగా ప్రత్యేక ఎంపి/ఎమ్మెల్యే కోర్టు అదనపు జిల్లా మరియు సెషన్స్‌ జడ్జి సుమన్‌ కుమార్‌ దివాకర్‌ గురువారం భద్రతా సిబ్బందిని ఆదేశించారు. కోర్టు తనను 24 గంటలపాటు కస్టడీకి ఆదేశించిందని యాదవ్‌ మీడియాకు తెలిపారు.

ఈ ఏడాది జనవరి 2న ఉమేష్‌ మిశ్రా అనే వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా గాయపరిచినందుకు దర్భాంగాలోని ప్రత్యేక ఎంపి/ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి /అడిషనల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కరుణనిధి ప్రసాద్‌ బిజెపి ఎమ్మెల్యే మిశ్రీలాల్‌ యాదవ్‌, అతని సహచరుడికి మూడు నెలల జైలు శిక్ష విధించారు. ఈ తీర్పుపై యాదవ్‌ అప్పీల్‌ దాఖలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -