నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్లో జరగనున్న మిస్వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి శుక్రవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న జూలియా మోర్లీకి సాంప్రదాయ బద్ధంగా ఘన స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు, మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించే ప్రాంతాలలో చేపట్టిన ఏర్పాట్లు, వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షిస్తారు.
- Advertisement -