Wednesday, June 4, 2025
E-PAPER
Homeజాతీయంక‌ర్నాట‌క హైకోర్టును ఆశ్రయించిన క‌మ‌ల్ హాస‌న్

క‌ర్నాట‌క హైకోర్టును ఆశ్రయించిన క‌మ‌ల్ హాస‌న్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ క‌ర్నాట‌క హైకోర్టును ఆశ్రయించారు. ఆయ‌న న‌టించిన థ‌గ్ లైఫ్ సినిమాను ఆ రాష్ట్రంలో విడుద‌లేయ్యే విధంగా ఆదేశాలు జారీ చేయాల‌ని ఆయ‌న పిటిష‌న్ లో పేర్కొన్నారు. మ‌ణిరత్నం ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన థ‌గ్ లైప్‌ ఈనెల 5న దేశవ్యాప్తంగా విడుద‌ల కానుంది.

కాగా కొద్దిరోజుల‌ చెన్నైలో ‘థగ్‌లైఫ్‌’ మూవీ ఆడియో కార్యక్రమానికి కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ కూడా వచ్చారు. ఈ సందర్భంగా కమల్‌ ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు.. నా జీవితం, నా కుటుంబం, తమిళ భాష అని చెప్పా. మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది. ఆ విధంగా మీరు భాగస్వామి అయ్యారు’ అని శివరాజ్‌కుమార్‌ను ఉద్దేశించి అన్నారు. దీంతో ఆయ‌న మాట‌ల‌పై పెద్ద దుమారం రేగింది.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై క‌న్న‌డ సంఘం మండిప‌డింది. వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, లేకుండా త‌గిన ప‌రిణామాలు ఎదురుకుంటార‌ని హెచ్చ‌రించింది. కానీ క‌మ‌ల్ మాత్రం తాను త‌ప్పు చెస్తేనే క్ష‌మాప‌ణ చెపుతాన‌ని లేకుంటే చెప్ప‌న‌ని మొండికేశారు. దీంతో ఆగ్ర‌హించిన క‌న్న‌డ ప్ర‌భుత్వం క‌మ‌ల్ న‌టించిన ఏ సినిమాలు కూడా క‌ర్నాట‌క‌లో విడుద‌ల కాకుండా నిషేధాజ్ఞ‌లు జారీ చేసింది. ఆ రాష్ట్ర స‌ర్కార్ నిర్ణ‌యాన్ని ఆయ‌న‌ తాజాగా హైకోర్టులో స‌వాల్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -