నవతెలంగాణ-హైదరాబాద్: కర్నాటక తొక్కిసలాట ఘటన పై ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. తాజాగా విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం ఆగ్రహాం వ్యక్తం చేసింది. వేల సంఖ్యలో అభిమానులు వస్తారని తెలిసి కూడా స్టేడియం వద్ద భద్రతా పరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా ఈవెంట్ నిర్వహించడం ఏంటని మండిపడింది. తొక్కిసలాట ఘటనపై ఈనెల 10వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని కర్నాటక ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, చిన్నస్వామి మైదానంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మొత్తం 11 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. స్వయంగా బాధితులను పరామర్శించారు. రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఘటనపై ప్రధాని మోడీ కూడా స్పందిచి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.