నవతెలంగాణ-హైదరాబాద్: కమల్హాసన్ నటించిన థగ్ లైఫ్(Thug Life) సినిమాను కర్నాటకలో రిలీజ్ చేయాల్సిందే అని, అది ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఫిల్మ్ను రిలీజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే అని కోర్టు చెప్పింది. సినిమా రిలీజ్ను అడ్డుకుంటామని బెదిరిస్తున్న వారిని నియంత్రించాలని, దీనిపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
కేసు వాదనల సమయంలో కర్నాటక సర్కారు ఇచ్చిన హామీలను ధర్మాసనం ఆలకించింది. ఒకవేళ ఎవరైనా సినిమాను అడ్డుకుంటే వారిపై కర్నాటక సర్కారు తీవ్ర చర్యలు తీసుకుంటుందని సుప్రీం తెలిపింది. ఒకవేళ థగ్లైఫ్ సినిమా రిలీజైతే .. థియేటర్లకు రక్షణ కల్పించనున్నట్లు కర్నాటక ప్రభుత్వం కోర్టు చెప్పింది.
థగ్ లైఫ్’మూవీ జూన్ 5న కర్ణాటకలో విడుదల కావాల్సి ఉంది. కానీ కన్నడ భాష “తమిళం నుండి పుట్టింది” అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యతో వివాదంలో చిక్కుకుంది. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్య, ముఖ్యంగా కన్నడ అనుకూల వర్గాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. పలు సంఘాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.