- కలెక్టర్ ఏవోకు వినతి పత్రం అందజేసిన
- డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్మకూరీ శ్రీకాంత్
నవతెలంగాణ మల్హర్ రావు(కాటారం)
కాటారం తహశీల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డివైఏప్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ జిల్లా కలెక్టర్ ఏఓకు బుధవారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా చెరువుల పరిరక్షణ కోసం కాటారం సబ్ డివిజన్ కేంద్రంగా అధికారులకు వినతి పత్రాలు ఎన్ని సార్లు అందజేసిన ఇప్పటివరకు ఏమాత్రం చర్యలు లేవని కనీసం ఎంక్వయిరీ చేసిన పాపాన పోలేదని అధికారులు ప్రభుత్వాస్తిని కొల్లగొడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ పూర్తిస్థాయి నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారని ఇది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఎమ్మార్వో కనీసం విచారణ చేసేందుకు పూర్తి స్థాయి నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారని ఆరోపించారు.కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో కాటారం మండల పరిధిలోని వివిధ చెరువులను రాత్రికి రాత్రే చెరువుల పరిరక్షణ నిబంధనలకు విరుద్ధంగా యాక్ట్ 1905ని ఉల్లంఘిస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా కొంతమంది అక్రమార్కులు చెరువులను చేరబడుతున్నారని సుమారు ఇప్పటివరకు రూ.10 కోట్ల రూపాయలకు పైచిలుకు విలువ చేసే మట్టిని తరలించారని దీని ద్వారా చెరువులు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయన్నారు. కాటారం పరిధిలోని పోతులవాయ్ శివారులోని నల్ల గుంట, విలాసాగారం శంకరంపల్లి ,దేవరంపల్లి, పరికిపల్లి చెరువులలో ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని తక్షణమే మట్టిని దోపిడీ చేస్తున్న అక్రమార్కులపై సమగ్ర విచారణ జరిపి తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం 1905 సెక్షన్ 5, 6,7, వాల్టా చట్టం 2001 సెక్షన్ 3, 4, 6 పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 సెక్షన్ 15
చెరువుల పరిరక్షణ నిబంధనలు ఉల్లంఘించి మట్టిని దోచుకుంటున్న వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. గత 12 రోజుల నుంచి పలుమార్లు కలిసిన వినతులు అందజేసిన అధికారులు పట్టించుకోకపోవడాన్ని వాళ్ళతో కుమ్మక్కయ్యారన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నామని అధికారులకు మీడియలో ఎన్నిసార్లు చెరువుల ఆక్రమణకు సంబంధించిన కథనాలు వచ్చిన బెకాతారు చేశారని అధికారులకు మీడియా అన్న ప్రజాసంఘాలన్నా, ప్రజాసంఘాల వినతులన్నా ప్రజలన్న ప్రభుత్వ ఆస్తులు అన్న ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అన్న విషయం చాలా స్పష్టమైందన్నారు. తక్షణమే ఎమ్మార్వో నాగరాజును సస్పెండ్ చేయాలని విన్నవించినట్లు ఆయన తెలిపారు.లేనిపక్షంలో చెరువుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు బంధు సుజాత జిల్లా కమిటీ సభ్యురాలు బుర్ర స్వాతి నాయకులు ప్రేమ్ కుమార్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.