- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత.. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదు. ముందుగా బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ సేఫ్గా ఉంది. మీ పార్టీ గురించి చూసుకోండి మా పార్టీ జోలికి రావద్దు’ అని హెచ్చరించారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదన్న కవిత వ్యాఖ్యలకు పొన్నం స్పందించారు.
- Advertisement -