- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవీకి జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామా చేశారు.పదవుల కోసం తన పోరాటం కాదని తెలిపారు. పార్టీలో తనపై కుట్రలు చేశారు. పార్టీకి నష్టం చేస్తుందని ఎమ్మెల్సీ కవితపై కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి స్పందించారు. హారీష్ రావు కుట్రలతో అనేక మంది పార్టీని వీడారు. ఈటల రాజేందర్, విజయశాంతి, రఘనందన్ రావులతో పాటు అనేక మంది బీఆర్ ఎస్ కు దూరంకావడానికి కారణం హారిష్ రావు అని కవిత సంచలన ఆరోపణ చేశారు. ఆరు అడుగుల బుల్లెట్ తో పార్టీ నేతలకు గాయాలు అవుతున్నాయని మండిపడ్డారు.
- Advertisement -