- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారట. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చడానికి ఆమె ఎన్నికల సంఘానికి (ఈసీఐ) దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె ప్రతినిధులు ఢిల్లీలో దరఖాస్తు సమర్పించినట్లు టాక్. మరో మూడు నెలల్లో పార్టీకి గుర్తింపు లభించే అవకాశం ఉందట. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కవిత పార్టీ పోటీ చేయవచ్చని, అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలని కవిత భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
- Advertisement -



