Friday, June 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకేసీఆర్‌ అంటే ఒక చరిత్ర

కేసీఆర్‌ అంటే ఒక చరిత్ర

- Advertisement -


విచారణ..హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమే : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌ను విచారణకు పిలిచారంటే.. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు. ఇరిగేషన్‌పై కేసీఆర్‌కు ఉన్న అవగాహన బహుషా ఈ దేశంలోని సమకాలీన రాజకీయ నాయకులలో ఎవరికీ ఉండదనీ, చివరకు ధర్మం, న్యాయమే గెలు స్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణను సాధించి న, సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్‌ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతదని అభిప్రా యపడ్డారు. బుధవారం కేసీఆర్‌ కాళేశ్వరం న్యాయ కమిషన్‌ ముందు విచారణకు హాజరైన అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టులను కూలగొట్టడానికి వచ్చారు తప్ప కట్టడానికి రాలేదన్నారు. విధ్వంసకరమైన ఆలోచనలతో పేదల ఇండ్లు కూలగొట్టడం, ప్రాజెక్టులను కూలగొట్టడం. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు తప్ప ఈయనకు ఏం చేతకావన్నారు. వంద జన్మలు ఎత్తినా రేవంత్‌ రెడ్డికి కేసీఆర్‌ గొప్పతనం అర్థం కాదని తెలిపారు. రేవంత్‌ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో గొడవ పడి ఇక్కడ నుంచి తరిమిన వాడే కేసీఆర్‌ అని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టం.. కాంగ్రెస్‌ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఈ చిల్లర రాజకీయాలను పట్టిం చుకోవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉండాలని ప్రజలకు పిలుపుని చ్చారు. క్యాబినెట్‌ ఎట్ల పని చేస్తదో తెలియదన్నారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ఆయనకు ముఖ్యమని వివరించారు. విచారణ పేరిట రేవంత్‌ రాక్షసానందం పొందుతు న్నారని అభిప్రాయ పడ్డారు. నిజం నిలకడగా తేలుతుందనీ, కొన్ని రోజు లు కాళేశ్వరం అని, ఫోన్‌ ట్యాపింగ్‌ అని, ఈ ఫార్ములా అని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. మంత్రివర్గ విస్తరణ చేయలేని సీఎం.. చివరకు శాఖలు కేటాయించుకోలేకపోతున్నారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -