Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఫామ్‌హౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్..

ఫామ్‌హౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కాళేశ్వరం కమిషన్ ఎదట బహిరంగ విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి బయలుదేరారు. సరిగ్గా ఆయన 11.30కి నగరంలోని బీఆర్కే భవన్‌కు చేరుకోనున్నారు. సమారు వంద కార్లకు పైగా కాన్వాయితో గులాబీ బాస్ విచారణకు హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు బీఆర్కే భవన్‌కు మాజీ మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇక కేసీఆర్ వెంట బీఆర్కే భవన్ లోపలికి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, మహబూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, బండారి లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ బహిరంగ విచారణ సందర్భంగా వేలల్లో కార్యకర్తలు బీఆర్కే భవన్ వద్దకు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీఆర్కే భవన్ రోడ్డును తాత్కాలికంగా మూసి వేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా వందల్లో పోలీసులను మోహరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad