- Advertisement -
– రెగ్యులర్ చెకప్లో భాగంగా వైద్య పరీక్షలు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జనరల్ చెకప్ కోసం శుక్రవారం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వచ్చారు. రెగ్యులర్ చెకప్లో భాగంగా కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇదిలా ఉంటే బుధవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరైనప్పుడు ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్టు వార్తలు వినిపించాయి. అనంతరం రెండు రోజులకే ఆస్పత్రికి రావడం కేసీఆర్ ఆరోగ్యంపై కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే సాధారణ వైద్య పరీక్షల కోసం ఆయన తరుచుగా తమ ఆస్పత్రికి వస్తారని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. ఆయన వెంట కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఉన్నారు.
- Advertisement -