- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు, జగన్మాత సీతాదేవిని వివాహమాడే పర్వదినముగా శ్రీరామ నవమిని జరుపుకుంటారని కేసీఆర్ తెలిపారు. వివాహం అనే పవిత్ర బంధంతో ఒక్కటయ్యే ఆలుమగల అన్యోన్యానినికి ప్రతీకగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నిలుస్తుందనీ కేసీఆర్ వివరించారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా శ్రీ సీతారాముల చల్లని దీవెనలు ఉండాలని కేసీఆర్ ప్రార్ధించారు.
- Advertisement -



