నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కార్మిక లోకానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఉత్పత్తిలో భాగమై జాతి సంపదను సృష్టిస్తున్న సబ్బండ కులాల శ్రామికులు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల రెక్కల కష్టానికి వెలకట్టలేమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారి త్యాగం అసామాన్యమైందని తెలిపారు. మేడే స్ఫూర్తితో రాష్ట్రంలోని శ్రామికుల హక్కులను కాపాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు వారి జీవన భద్రతకు భరోసాను పెంచాయని పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టామని తెలిపారు. నూతన పారిశ్రామిక విధానాలను అమలు చేసి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించామని పేర్కొన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామని వివరించారు. ఉత్పత్తి సేవా రంగాల్లో పాల్గొనే మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలను హక్కులను కల్పించి అండగా నిలిచామని తెలిపారు. సింగరేణి, ఆటోడ్రైవర్లు, పలు పరిశ్రమలు సహా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న శ్రామికులకు అన్ని రకాలుగా భరోసా కల్పించామని పేర్కొన్నారు.
కార్మికులకు కేసీఆర్ మేడే శుభాకాంక్షలు
- Advertisement -
RELATED ARTICLES