- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో కేసీఆర్ గురువు జైశెట్టి రమణయ్య (85) మృతి చెందారు. కేసీఆర్ సిద్దిపేటలో ఇంటర్ చదివినప్పుడు రమణయ్య హిస్టరీ పాఠాలు చెప్పారు. రమణయ్య మృతి పట్ల కేసీఆర్ సంతాపం తెలిపారు. గురువు రమణయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన కుటుంబసభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. కాగా జగిత్యాలలో మొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా రమణయ్య గుర్తింపు పొందారు.
- Advertisement -



