గోకులం సిగేచర్ జువెల్స్ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం ఆదివారం అంగ రంగ వైభవంగా జరిగింది. కూకట్పల్లిలోని నెక్సస్ మాల్ ఎదురుగా ఉన్న వాసవి శ్రీశ్రీ సిగేచర్లో ‘గోకులం సిగేచర్ జువెల్స్’ సరి కొత్త షోరూమ్ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభించారు.
తెనాలికి గర్వకారణమైన గోకులం సిగేచర్ జువెల్స్ ఇప్పుడు హైదరాబాద్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని నిర్వాహకులు పొత్తూరి సుబ్బా రావు, పొత్తూరి లలిత కుమారి, బాబురావు అన్నారు. భారతీయ మహిళల స్కిన్ టోన్కు తగ్గట్టుగా సిల్వర్లో సరికొత్త అధ్యయానికి నాంది పలికారు.
ఈ ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ, ‘గోకులం సిగేచర్ జువెల్స్’ షోరూమ్లో సిల్వర్ జ్యువలరీ, లాబ్ గ్రోన్ డైమండ్స్, వివాహా వేడుకలు, అన్ని సందర్భాలకు ప్రత్యేక కలెక్షన్స్ ఉన్నాయి. డైమండ్ సెట్ను ధరించి చూసి నప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా చాలా బాగుంది’ అని తెలిపారు. షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ,’ కూకట్పల్లిలోని ఈ కొత్త షోరూమ్కు మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ప్రజలు మంచి పేరు తెచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము మా కస్టమర్లకు నూతన మోడల్స్, నాణ్యత, మన్నికతో వెండి, వజ్ర ఆభరణాలను అందిస్తున్నాం’ అని తెలిపారు.
ట్రెండ్కి తగ్గట్టుగా..
- Advertisement -
- Advertisement -