నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన శాంతి చర్చలు ఫలించడంతో 25 ఏళ్లలోపు రష్యా-ఉక్రెయిన్కు చెందిన ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. దీంతో యుద్ధ ఖైదీల ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. వీళ్లంతా యుద్ధం ప్రారంభం నుంచి ఉన్న ఖైదీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రహస్య ప్రదేశంలో ఈ ఖైదీల మార్పిడి జరిగినట్లుగా సమాచారం.
రెండు దేశాల మధ్య గత నాలుగేళ్ల నుంచి భీకర యుద్ధం సాగుతోంది. మరోసారి ఇస్తాంబుల్ వేదికగా శాంతి చర్చలకు సిద్ధపడుతుండగా అకస్మాత్తుగా ఉక్రెయిన్.. రష్యాపై డ్రోన్ దాడులు చేసింది. దీంతో రష్యా వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో రెండు దేశాల మధ్య యుద్ధ ఖైదీల మార్పు శుభ పరిమాణం.