Monday, March 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం...ముగ్గురికి రిమాండ్

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం…ముగ్గురికి రిమాండ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, వ్యాపారి నమిత్ శర్మలకు ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నిందితుల బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది.

రోహిత్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి సమయంలో నమిత్ శర్మ అనే వ్యాపారి పోలీసులపైకి కాల్పులు జరిపినట్టు ఆరోపణలు వచ్చాయి. పైలట్ రోహిత్‌రెడ్డి ఆదేశాలతోనే తాను కాల్పులు జరిపినట్టు నమిత్ శర్మ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. ఈ కాల్పుల ఘటన కేసును మరింత తీవ్రతరం చేసింది.

పోలీసులు ముగ్గురు నిందితులను ఉప్పర్‌పల్లి కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా, కాల్పుల ఘటనపైనే ప్రధానంగా వాదనలు జరిగాయి. నిందితుల తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం వాదించినప్పటికీ, కేసు తీవ్రత దృష్ట్యా మేజిస్ట్రేట్ వారి అభ్యర్థనను తోసిపుచ్చారు. పార్టీలో పాల్గొన్న మొత్తం 11 మందిలో 8 మందికి నోటీసులు ఇచ్చి పంపించిన పోలీసులు, ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాలతో నిందితులు ముగ్గురినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -