- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ముందు కశ్మీర్తోపాటు పలు రాష్ట్రాల్లో సంచరిస్తూ..యూట్యూబర్ మూసుగులో పాక్ దేశానికి గూఢచారం వహించిన జ్యోతి మల్హోత్రా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఇప్పటికే హర్యానా కోర్టులో పోలీసుల అభ్యర్థన మేరకు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన ల్యాప్టాప్లు, ఫోన్లను పరిశీలించిన పోలీసులు..ముఖ్యమైన ఆధారాలను సేకరించారు. తాజాగా జ్యోతి మల్హోత్రా తరుపున వాదించడానికి హర్యానాలోని హిసార కోర్టు ఓ లాయర్ని నియమించింది. ఇకపై ఆమె తరుపున వకీల్ కుమార్ ముఖేష్ వాదించనున్నారని హిసార జిల్లా కోర్టు పేర్కొంది.
- Advertisement -