Friday, May 30, 2025
E-PAPER
Homeజాతీయంఎన్‌కౌంటర్‌లో బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన కీలక వ్యక్తి మృతి

ఎన్‌కౌంటర్‌లో బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన కీలక వ్యక్తి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన ఓ కీలక వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో షార్ప్‌ షూటర్‌గా పేరొందిన నవీన్‌కుమార్‌ 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు.
హాపుర్‌లో ఉత్తరప్రదేశ్‌ టాస్క్‌ఫోర్స్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఒక ఆపరేషన్‌ నిర్వహించారు. ఈక్రమంలో బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన నవీన్‌కుమార్‌ అక్కడికి వచ్చాడు. పోలీసులను చూసి వారిపై కాల్పులు జరిపి అడవుల్లోకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమార్‌ ఘజియాబాద్‌ జిల్లా ‘లోని’ ప్రాంతానికి చెందినవాడు. లారెన్స్‌ గ్యాంగ్‌లో షార్ప్‌ షూటర్‌గా పేరొందాడు. ఆ గ్యాంగ్‌ సభ్యుల్లో ఒకడైన హషీం బాబాతో కలిసి పనిచేస్తున్నాడు. ఢిల్లీ, యూపీలలో హత్యా, హత్యాయత్నం, కిడ్నాప్‌, దోపిడీలతో సహా మొత్తం 20 కేసుల్లో కుమార్‌ నిందితుడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -