నవతెలంగాణ-హైదరాబాద్: భారత రాజ్యాంగాన్ని గానీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం మోడీ, అమిత్షాలకు లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బుధవారం ఖర్గే గుజరాత్లోని జునాగఢ్కి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షాల ప్రధాన లక్ష్యం ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడడటమే. ప్రజాస్వామ్యంలో (ఎన్నికలలో) పోరాడటం సర్వసాధారణమే. కానీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే మా లక్ష్యం. మహాత్మాగాంధీ, సర్దార్వల్లభారుపటేల్ వంటి గొప్ప వ్యక్తులు జన్మించిన భూమి ఇది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన ఈ ఇద్దరు మనకు అత్యంత గౌరవనీయులు. వారివల్లే దేశం ఐక్యం ఉంది. కానీ మరో ఇద్దరు వ్యక్తులు (మోడీ, అమిత్షా) మాత్రం రాజ్యాంగం సురక్షితంగా ఉండాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కానీ కోరుకోవడం లేదు’ అని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నిలపై ఆయన స్పందించారు. ‘మాకు మెజారిటీ లేదు. అయినప్పటికీ మాకు ఉన్నన్ని ఓట్లు వచ్చాయి’ అని ఖర్గే అన్నారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, దీన్ని తీవ్రమైన విషయంగా పరిగణించి దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు.