- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మణిపూర్ నూతన సీఎంగా యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ 2023 మే నుంచి అట్టుడికింది. గతంలో ఫిబ్రవరిలో అప్పటి సీఎం బీరెన్సింగ్ రాజీనామా చేయడంతో రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది.
- Advertisement -


