దాదాపు పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకుడిగా రీఎంట్రీ ఇవ్వడానికి ఎస్.జె. సూర్య సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందు తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కిల్లర్’. ఈ చిత్రంలో ఆయన హీరోగానే కాకుండా కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ కూడా సమకూరుస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతత్వంలో) ఎస్జె సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళ, కన్నడ తదితర భాషలలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గొకులం మూవీస్ ఈ సినిమాతో తమిళ సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వి.సి.ప్రవీణ్, బైజు గోపాలన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కష్ణమూర్తి వ్యవహరిస్తున్నారు. ‘వాలి’, ‘ఖుషీ’, ‘న్యూ’ వంటి క్లాసిక్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్జె సూర్య ఈ సినిమాకు భారీ తారాగణాన్ని తీసుకొస్తున్నారు. అంతే కాదు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం శుక్రవారం పూజా కార్యాక్రమాలతో ప్రారంభమైంది. హీరో కార్తీ హాజరై టీమ్ని అభినందించారు. ‘కిల్లర్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే స్థాయి సినిమా ఇవ్వాలనే సంకల్పం మాది. దేశవ్యాప్తంగా ప్రతిభ గల నటులు, సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో ప్రేక్షకుల హదయాల్లో నిలిచిపోయే చిత్రంగా రూపొందించబోతున్నాం’ అని నిర్మాతలు తెలిపారు.