Saturday, September 20, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణ మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొ. కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ల నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో గ‌వ‌ర్న‌ర్ కోటాలో తిరిగి కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును కేబినెట్ ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ బై పోల్ లో కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్న అజారుద్దీన్ పేరును అనూహ్యంగా ఎమ్మెల్సీగా ప్రకటించడంతో.. జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -