- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాల యందు బుధవారం కొమురం భీమ్ జయంతి కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మద్దికుంట శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొమురం భీమ్ ప్రత్యేకమైన ఆదివాసి రాజ్యం కోసం స్వపరిపాలన కోసం, ఆదివాసి హక్కుల కోసం పోరాడిన ఒక గొప్ప వీరుడని తెలిపారు. ఈయన జెల్.. జంగల్… జమీన్ ..బచావో… అని నినాదంతో ప్రజలలో స్ఫూర్తి నింపారని అన్నారు .ఈ కార్యక్రమంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -