- Advertisement -
– హర్షం వ్యక్తం చేసిన కాలనీ వాసులు…
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి పట్టణంలోని హనుమాపూర్ రోడ్డులో గల బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత ఎం ఏ మజీద్ బాబా ఆధ్వర్యంలో నూతన వెంచర్ లో ప్లాట్లు , ఇండ్లు కొనుగోలు చేసే వారికోసం ప్రత్యేకంగా కృష్ణ వాటర్ కు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కృష్ణ వాటర్ భూమి పూజ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబా ఇన్ఫో డెవలపర్స్ ఎండి బాబా మాట్లాడుతూ మా కస్టమర్లకు అందించడానికి బుధవారం భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిల్డర్లు , బాబా ఇన్ఫ్రా డెవలపర్స్ సిబ్బంది లు పాల్గొన్నారు.
- Advertisement -