తొక్కిసలాటకు ఘటనకు నైతిక బాధ్యత
బెంగళూర్ : ఐపీఎల్18 చాంపియన్గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ విజయోత్సవ సంబరాలు విషాదం మిగల్చగా.. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కెేఎస్సీఏ) నుంచి ఇద్దరు ఆఫీస్ బేరర్లు రాజీనామా చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ విజయోత్సవాల్లో 11 మంది అభిమానులు మరణించగా పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కార్యదర్శి ఏ శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్లు ఈమేరకు రాజీనామా లేఖలను అధ్యక్షుడు, మాజీ ఆటగాడు రఘురామ్ భాట్కు పంపించారు. ‘గత రెండు రోజుల్లో చోటుచేసుకున్న ఊహించని, విషాదకర ఘటనల్లో మా పాత్ర ఎంతో స్వల్పం. అయినా, నైతిక బాధ్యత వహిస్తూ కేఎస్సీఏలో మా పదవులకు రాజీనామా చేస్తున్నామని’ శంకర్, జైరామ్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో కెేఎస్సీఏ ఆఫీస్ బేరర్లను నిందితులుగా చేర్చుతూ బెంగళూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మార్కెటింగ్ చీఫ్ నిఖిల్ సహా ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ డిఎన్ఏ ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమపై మోపిన అభియోగాలను కొట్టివేయాలని అప్పటికే కెఎస్సీఏ హైకోర్టులో పిటిషను దాఖలు చేయగా న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
కెేఎస్సీఏ కార్యదర్శి రాజీనామా
- Advertisement -
- Advertisement -