- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జిలతో రేపు కేటీఆర్ సమావేశం కాబోతున్నారు.
- Advertisement -