- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్ జట్టులో మార్పులు జరిగాయి. ఐపీఎల్ 2026 కోసం కుమార సంగక్కరను మళ్లీ హెడ్ కోచ్గా నియమించింది. ఇప్పటివరకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్న ఆయన రెండు బాధ్యతలు నిర్వహించనున్నారు. విక్రమ్ రాథోడ్ను లీడ్ అసిస్టెంట్ కోచ్గా ప్రమోట్ చేయగా, ట్రెవర్ పెన్నీని తిరిగి అసిస్టెంట్ కోచ్గా తీసుకున్నారు. సంగక్కర 2021-24లో కోచ్గా ఉండగా జట్టు రెండుసార్లు ప్లేఆఫ్స్కు చేరి, 2022లో ఫైనల్ ఆడింది. ఇక సంజు శాంసన్ సీఎస్కేకు మారడంతో కొత్త కెప్టెన్పై ఆసక్తి పెరిగింది.
- Advertisement -



