- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కాగా, ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు.. రోడ్డుపై పడి ఉన్న బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి సజీవ దహనమయ్యారు. సీటర్ వాహనాన్ని స్లీపర్గా మార్చినట్లు, బస్సు రిజిస్ట్రేషన్ విషయంలోనూ లొసుగులున్నట్లు గుర్తించారు.
- Advertisement -



