కరపత్రాలు విడుదల
నవతెలంగాణ-చిట్యాల:ఈనెల 22, 23వ తేదీలలో కట్టంగూర్లో జరగనున్న కెేవీపీఎస్ నల్లగొండ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల జయప్రదం కోసం ఆదివారం మండలకేంద్రంలో ఆ సంఘం నాయకులు వంటెపాక కృష్ణ,బొడ్డుబాబురావు కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా స్థాయి క్లాసులకు సంఘం రాష్ట్ర కార్యదర్శి టీ.స్కైలాబ్బాబు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండేటి శ్రీను,పాలడుగు నాగార్జున తదితర నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్,కెేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుబాబురావు, గాదె ఎల్లేష్,బరాల యాదగిరి,పాలు రమేష్,బీంపాక నర్సింహా,బోడ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ శిక్షణా తరగతుల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES