జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేత….*
తాడ్వాయి మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి..
నవతెలంగాణ -తాడ్వాయి
గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్ల పట్టా స్థలం కేటాయించి, ఇప్పటివరకు ఇంటి స్థలాలు కొలిసి ఇవ్వలేదని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జెడ్పిటిసి రామసహాయం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే లో పట్టాలు పొందిన లబ్ధిదారులతో వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపూర్ గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం 2023 సంవత్సరంలో ఒక్కొక్కరికి 75 గజాలు ఇంటి స్థలాన్ని 108 మంది లబ్ధిదారులకు అందజేశారని, వాటిని ఎవరికి వారికి అందిస్తే వారు గుడిసెలు వేసుకుంటారని మాజీ జెడ్పిటిసి రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి 75 గజాల చొప్పున 108 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందించారని, ఇప్పుడు అధికారులు ప్రభుత్వం దాన్ని తాత్కారం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు ఇంటి స్థలాలు ఇవ్వడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషించారని అయితే అధికారులు తిరిగి ఆ స్థలాలను ఎందుకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు ? మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవిందు నాయక్ మాట్లాడుతూ లబ్ధిదారులు అనేకసార్లు ఎమ్మార్వో, కలెక్టర్ కలిసినా కూడా వాళ్ల సమస్యలు విన్నవించిన కూడా పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, మాజీ సర్పంచ్ పూలూరి గౌరమ్మ, మాజీ ఎంపిటిసి ధనక నరసింహారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు రంగు సత్యం, నాయకులు సాయిరి లక్ష్మీ నరసయ్య, వహీద్, లంజబెల్లి రాంబాబు, వెంకటేష్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.