Saturday, June 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు లాసెట్‌ పరీక్ష

నేడు లాసెట్‌ పరీక్ష

- Advertisement -

– హాజరు కానున్న 57,715 మంది అభ్యర్థులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో లా కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్‌ రాతపరీక్ష శుక్రవారం ఆన్‌లైన్‌లో జరగనుంది. లాసెట్‌లో భాగంగా మూడేండ్ల లా కోర్సుకు 41,210 మంది, ఐదేండ్ల లా కోర్సుఉ 11,695 మంది, ఎల్‌ఎల్‌ఎంకు 4,810 మంది కలిపి 57,715 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. వారి కోసం మొదటి, రెండో విడత పరీక్షలను నిర్వహించేందుకు 76 పరీక్షా కేంద్రాలు, మూడో విడత పరీక్ష నిర్వహణ కోసం 65 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడేండ్ల లా కోర్సులో ప్రవేశాల కోసం మొదటి విడత ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల వరకు నిర్వహిస్తారు. ఐదేండ్ల లా కోర్సు, ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశాల కోసం మూడో విడత పరీక్షను సాయంత్రం నాలుగు నుంచి 5.30 గంటల వరకు జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -