- Advertisement -
నవతెలంగాణ – అమరావతి: తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించింది. మొదటి ఘాట్ రోడ్డులో, రక్షణ గోడపై వినాయకుడి ఆలయం సమీపంలో చిరుత సంచరించడాన్ని కొందరు భక్తులు గుర్తించి ఫోటోలు, వీడియోలు తీశారు. సమాచారం అందిన వెంటనే టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భక్తులను అప్రమత్తం చేశారు. సోమవారం ఉదయం అలిపిరి కాలినడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు తెలియజేశారు.
- Advertisement -