Saturday, March 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమల శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది… శ్రీవారిమెట్టు మార్గంలోని 500వ మెట్టు దగ్గర పొదల్లో సేదతీరుతూ చిరుత కనిపించింది. దీంతో నడకమార్గంలో వెళుతున్న భక్తులు భయబ్రాంతులకు లోనయ్యారు. భక్తులు చిరుత సంచారం గురించి సెక్యూరిటీకి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది అరగంట శ్రమించి సైరన్ మోతతో చిరుతను తరిమేశారు. శ్రీవారిమెట్టు సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర అరగంట పాటు భక్తులను నిలిపేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -