- Advertisement -
- – ఆహారపు అలవాట్లు మార్చుకోండి,ఆయుః ప్రమాణం పెంచుకోండి
నవతెలంగాణ – దామరచర్ల
మనిషి మనుగడకు ఆహారపు అలవాట్లు ప్రధాన కారణమని, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆయుః ప్రమాణాన్ని పెంచుకొనే అవకాశం ఉందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు కోలా శ్రీనివాస్, నల్లగొండ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ సుదర్శన్ రెడ్డి అన్నారు. దామరచర్ల మండలం లోని బొల్లిగుట్ట తండా గ్రామం లో ఉపాధి హామీ పనులు చేసే వారి వద్దకు శుక్రవారం వెళ్లి ఆరోగ్య విషయాలు చెబుతూ, ఉపాధి హామీ పనుల నాణ్యత పెంచాలని, వేసవి దృష్టిలో ఉంచుకొని వీలయినంత వరకు ఉదయం తొందరగా వెళ్లి పనులు చేసుకొని ఎండ సమయానికి ముగించుకోవాలని సూచించారు. అదే విధంగా పక్షవాతము, మూర్చలు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్న నిరుపేదలకు మిర్యాలగూడ హొసింగ్ బోర్డు లోని నవ జ్యోతి ఇంగ్లిష్ మీడియం స్కూల్ నందు ప్రముఖ నరాల వైద్యులు గోపాలం శివన్నారాయణ చే పరీక్షించి, రోగినుండి నెలకు 75 రూపాయలు, నాలుగు నెలలకు కలిపి 300 రూపాయలు నామమాత్రంగా తీసుకొని దాతల సహకారం తో 4 నెలలకు వారికి అవసరమయ్యే మందులు అందజేస్తున్నామని, ఇట్టి అవకాశాన్ని ఉపయోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు పారెపల్లి సత్యనారాయణ రావు, పాధురి రమణా రెడ్డి మాట్లాడుతూ వంట నూనెల వాడకం ప్రతీ నెల బాగా పెరుగుతుందని, మార్కెట్ లో దొరికే నూనెలకన్నా, వేరు శనగలు నువ్వులు, కుసుమలు, కొబ్బరి వంటి వాటిని గానుగలలో ఆడించి తీసిన నూనెలు వాడాలని, వంటకు అల్యూమినియం పాత్రలు వాడినట్లయితే అవి కరిగి మనం తినే ఆహారం లోకి వెళ్లి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నందున స్టీలు, ఇనుప పాత్రలు వంటకు ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు.సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూనేమూఢ నమ్మకాలను వదిలి వేయాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గణేష్ మాట్లాడుతూ కృత్రిమ శీతల పానీయలు అయిన కూల్ డ్రింక్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, తియ్య ధనం కోసం దానిలో రసాయన పాదర్ధాలు వాడుతున్నారని వాటిని తాగడం వలన అల్సర్ లు, కాలేయ సంభతిత రోగాలు వచ్చే అవకాశం ఉందని వాటిని త్రాగడం మానివేసి సహజ పానియాలు అయిన పళ్ళ రసాలు, మజ్జిగ, షర్భత్ వంటి వాటిని సేవించాలని, విద్యార్థులను నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రులలో రక్త పరీక్షలు చేయించుకొని తమ ఆధాయాన్ని ఆధా చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంచే గుర్తించ బడిన జెనరిక్ మందులను వాడాలని, వాణిజ్య ప్రకటన లు చూసి మోసపోవద్దని, వేసవి కాలం దృష్ట్యా సాధ్యమైనంత వరకు ఎండ రాకముందే ఆరుబయట పనులు ముగించుకొని, వీలయినంత వరకు ఎక్కువ నీటిని తీసుకొని వడ దెబ్బ ప్రమాదానికి గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాడపల్లి స్కూల్ అసిస్టెంట్ భైరం శేఖర్, పంచాయతీ కార్యదర్శి సాయి, ఫీల్డ్ అసిస్టెంట్ లాలు ఉపాధి హామీ పధకం సేవకులు పాల్గొన్నారు.
- Advertisement -